రూ.కోటి పెట్టి .. ఎంపీపీ పదవి కొన్నా: బీఆర్​ఎస్​ ఎంపీపీ

రూ.కోటి పెట్టి .. ఎంపీపీ పదవి కొన్నా: బీఆర్​ఎస్​ ఎంపీపీ

అశ్వారావుపేట, వెలుగు: మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బుధవారం అశ్వారావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టౌన్​లోని ప్రతి షాపుకు తిరుగుతూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్​ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి బట్టల షోరూమ్​కు వెళ్లారు. 

ఎంపీపీ అయి ఉండి ఇంత చిన్న షాపు నడపడం ఏమిటని వెంకటేశ్వర్లు ప్రశ్నించగా, ‘పదవిలోకి వచ్చిన తర్వాత రూ.2కోట్లు నష్టపోయాను. రూ.కోటి పెట్టి ఎంపీపీ పదవిని కొనుక్కున్నాను’ అని మీడియా ముందే శ్రీరామ్​మూర్తి చెప్పారు.