
మెదక్ టౌన్, వెలుగు : ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్గరేట్కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల నిర్వహణపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్వో, ఏఆర్వోలు, సెక్టార్ అధికారుల పాత్ర కీలకమన్నారు. మెదక్ లో31, నర్సాపూర్ లో 33 సెక్టార్ అధికారులను నియమించామని, అదనంగా మరో ఆరుగురు సెక్టార్ అధికారులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈనెల 26, 27, సెప్టెంబర్ 2, 3న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, సెల్ఫ్హెల్ప్ గ్రూపులతో ఓటర్ అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 579 పోలింగ్స్టేషన్లు ఉన్నాయని, వాటిలో మౌలిక సదుపాయాలు పరిశీలించాలని ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, సూపర్వైజర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు అంబదాస్ రాజేశ్వర్, జయచంద్రారెడ్డి, ఎన్నికల సమన్వకర్త రాజిరెడ్డి, తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.అనంతరం ఆర్డీవోలు, తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ధరణి పెండింగ్ దరఖాస్తులను, గృహలక్ష్మి దరఖాస్తులను వేగంగా పరిశీలించాలని ఆదేశించారు.