నవంబర్ 3న హైదరాబాద్ కి చేరుకోనున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు

నవంబర్ 3న హైదరాబాద్ కి చేరుకోనున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ జిల్లాలోని 15 సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల వ్యయ పరిశీలకులు ఈ నెల3న సిటీకి రానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోనాల్డ్‌‌‌‌‌‌‌‌ రాస్‌‌‌‌‌‌‌‌ బుధవారం ఓ  ప్రకటనలో తెలిపారు. ముషీరాబాద్, నాంపల్లి సెగ్మెంట్లకు వ్యయ పరిశీలకుడిగా సుబోద్ సింగ్, లైజనింగ్ ఆఫీసర్​గా దశరథ్​, మలక్ పేట, అంబర్ పేట సెగ్మెంట్లకు వ్యయ పరిశీలకులుగా లక్ష్మీకాంత దాసప్ప,  లైజనింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లక్ష్మి గణేశ్​ను నియమించారన్నారు. వీరితో పాటు మిగతా సెగ్మెంట్లకు సంబంధించి వ్యయ పరిశీలకులు రేపు సిటీకి చేరుకుంటారని రోనాల్డ్ రాస్ తెలిపారు.