
హైదరాబాద్: నిమ్స్పార్కింగ్ ఆవరణలో అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ( అక్టోబర్ 18) ఉదయం పార్కింగ్ లో ఉంచిన ఎలక్ట్రిక్బైక్ లోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట పొగలు, ఆ తర్వాత మంటలు చెలరేగి పెద్ద ఎత్తున పొగ, మంటలు ఎగిసిపడ్డాయి.దీంతో పేషెంట్లు, వారి అటెండెంట్లు, నిమ్స్ సిబ్బంది పరుగులు పెట్టారు.
పార్కింగ్ లో పెట్టిన బైక్ లోంచి ఆకస్మాత్తుగా పొగలు రావడంతో గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది బైక్ ను బయటికి లాగారు. అయితే ఈలోపే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నీళ్లు, ఫోం వాడినా కూడా మంటలు చల్లారలేదు. దాదాపు అరంగపాటు నిమ్స్ పార్కింగ్ ఆవరణలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో ఆస్పత్రి భవనాలకు వ్యాపిస్తాయోమోనని భయపడ్డారు. చివరికి మంటలు అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.