
- దాతల సాయంతో కొనుగోలు చేయాలని నిర్ణయం
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో కాలేజీలకు వెళ్లే స్టూడెంట్లు, అధ్యాపకులు, సిబ్బంది కోసం ఎలక్ట్రిక్ బస్సులు నడిపించాలని వర్సిటీ అధికారులు యోచిస్తున్నారు. బస్సుల కోనుగోలుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని ఓల్డ్ స్టూడెంట్లు, ఎన్జీవోలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ సంస్థల నుంచి తీసుకోవాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదలను కూడా సర్కార్కు పంపించారు. 40 మంది ప్రయాణికుల కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి ప్రతిరోజు ఎన్సీసీ గేటు నుంచి పోలీస్స్టేషన్ వరకు తిప్పనున్నారు. ఈ బస్సుల్లో ఎలాంటి చార్జీలు వసూలు చేయరు. ఆఫీసర్ల ప్రయత్నాలు ఫలిస్తే ఈ నెలా ఆఖరులోగా క్యాంపస్ రోడ్లపై ముందుగా రెండు బస్సులు తిరగనున్నాయి.