ఏనుగు బీభత్సం…ఐదుగురు వ్యక్తులు మృతి

ఏనుగు బీభత్సం…ఐదుగురు వ్యక్తులు మృతి

ఒడిశాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మొత్తం ఐదుగురు వ్యక్తులను తొక్కి చంపింది. ఒకే కుటుంబంలోని నలుగురిపై ఈ ఏనుగు దాడి చేసింది. వీరిలో మహిళ, ఇద్దరు చిన్నారులున్నారు. తాల్చేర్‌ ప్రాంతంలోని సాంధా అనే గ్రామంలో గురువారం రాత్రి ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో ఢెంకానాల్‌ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగు ఆ ఇంటిపై దాడి చేసింది. నిద్రలో ఉన్న నలుగురినీ తొక్కింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.  తర్వాత సంత్‌ పద అనే గ్రామంలో మరో వ్యక్తిపై దాడి చేసి చంపింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును అక్కడి నుంచి తరిమికొట్టారు.