దంపతులతో పాటు 10 ఆవులను తొక్కి చంపేసిన ఏనుగులు

దంపతులతో పాటు 10 ఆవులను తొక్కి చంపేసిన ఏనుగులు

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గుడిపాల మండలంలో దంపతులపై ఏనుగుల గుంపు దాడి చేసి చంపేశాయి. ఏనుగుల దాడిలో భార్యాభర్తలు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 


ALSO READ :గర్ల్స్ హాస్టల్ విద్యార్థినుల రాస్తారోకో.. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్

మృతులు190 రామాపురం దళితవాడకు చెందిన వెంకటేష్, సెల్వీగా గుర్తించారు. బస్వాపల్లికి చెందిన కార్తీ‌క్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏనుగుల దాడిలో 10 ఆవులు కూడా మృతిచెందాయి. ఈ ఘటనతో సమీప గ్రామస్తులు భయాందోళనతో వణికిపోతున్నారు. 

మరోవైపు స్థానికులు పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనాస్థలిని పరిశీలిస్తున్నారు. దంపతుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.