
హైదరాబాద్, వెలుగు: నగరంలోని గచ్చిబౌలి రోడ్ వద్ద నిర్మించిన ది ఎలైట్ హోటల్ను ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రారంభించారు. హోటల్ ప్రారంభోత్సవానికి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు , ప్రముఖ దర్శకులు సంపత్ నంది, విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు ముఖ్య అతిథులుగా వచ్చారు.
ఈ సందర్భంగా నిధి మాట్లాడుతూ హోటల్ చూడటానికి అందంగా ఉందని, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందని మెచ్చుకున్నారు. హోటల్ యజమానులు మీడియాతో మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో వివిధ ప్రాంతాల్లో మరో 15 హోటల్స్ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రస్తుత హోటల్లో 72 గదులు ఉంటాయని తెలిపారు.