మహిళా సాధికారతకు పథకాలు : దొంతి మాధవరెడ్డి

మహిళా సాధికారతకు పథకాలు :  దొంతి మాధవరెడ్డి

 

నల్లబెల్లి, వెలుగు: మహిళాసంఘాల అభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం కృషి చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో సోమవారం మహిళా గ్రామైక్య సంఘాల మహాసభ నిర్వహించారు. ముఖ్య​అతిథిగా హాజరైన ఆయన రూ.12 కోట్ల విలువైన బ్యాంకు రుణాల చెక్కును ఆయా సంఘాల ప్రతినిధులకు అందించారు. 

 మహిళా సాధికారిత కోసం సీఎం రేవంత్​రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. త్వరలో మహిళా సంఘాలచే గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు సైతం  ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవోలు నరసింహాచారి, అరుంధతి, తహసీల్దార్​ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.