హైదరాబాద్, వెలుగు: ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ ల్యూమినస్ పవర్ టెక్నాలజీస్, ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్లో మొదటి సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ల్యూమినస్ పవర్ టెక్నాలజీస్ సీఈఓ ప్రీతి బజాజ్, ల్యూమినస్ బోర్డ్ ఛైర్మన్ - మనీష్ పంత్లతోపాటు లెజెండరీ క్రికెటర్ ల్యూమినస్ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ టెండూల్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్లో అతిపెద్దది అయిన ఈ సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీ 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
ఆటోమేటెడ్ సరికొత్త అత్యాధునిక సోలార్ మాడ్యూల్ తయారీ టెక్నాలజీలు దీని సొంతం. 250 మెగావాట్లతో మొదలైన ఈ అత్యాధునిక ప్లాంట్ సామర్థ్యంతో 1 గిగావాట్ వరకు విస్తరించింది. ఈ ప్లాంట్ పాలీక్రిస్టలైన్, మోనోక్రిస్టలైన్, ఎన్-టైప్ టాప్కాన్, హెటెరోజంక్షన్ ప్యానెల్లను, మోనోఫేషియల్ బైఫేషియల్ ఇన్సెంట్స్ను తయారు చేస్తుందని ల్యూమినస్ ఈ సందర్భంగా ప్రకటించింది.