ఇంగ్లాండ్ టార్గెట్ 169 రన్స్

ఇంగ్లాండ్ టార్గెట్ 169 రన్స్

సెకండ్ సెమీస్లో ఇంగ్లాండ్ కు టీమిండియా 169 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ముందుగా టాస్  ఓడి బ్యాటింగ్ చేసిన భారత్..20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. గత రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన కేఎల్ రాహుల్..ఈ మ్యాచ్ లో కేవలం 5 పరుగులే చేశాడు. ఇక గత మ్యాచుల్లో విఫలమైన రోహిత్ శర్మ..27 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ..హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అయితే గత మ్యాచుల్లో చిచ్చరపిడుగుల చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ మాత్రం విఫలమయ్యాడు. సూర్య ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులు, ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. 33 బంతుల్లో 63 పరుగులు చేసి చివరి బంతికి పెవీలియన్ చేరాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోర్దాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. రషీద్, వోక్స్ చెరో వికెట్ తీశారు.