తెలంగాణలో ఎంట్రన్స్ టెస్టులు రీషెడ్యూల్

 తెలంగాణలో ఎంట్రన్స్ టెస్టులు రీషెడ్యూల్
  • ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి పాపిరెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జూలై 5 నుండి 9 వరకు జరగాల్సిన మూడు  ఎంట్రెన్స్ టెస్ట్ లు రీషెడ్యూల్ చేసినట్లు  ఉన్నత విద్యా మండలి చైర్మన్ టి పాపిరెడ్డి వెల్లడించారు. ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ప్రభుత్వ అనుమతి రాగానే తేదీలను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మొత్తం ఏడు సెట్స్ లో 3 సెట్స్ తేదీల్లో మార్పు ఉంటుందని, మిగిలిన నాలుగు సెట్స్ పరీక్షలు యధాతధంగా ఉండే అవకాశం ఉందని ఆయన వివరించారు. 
ఆగష్టు చివరి వారంలో ఫలితాలు 
అన్ని ఎంట్రన్ టెస్టుల ఫలితాలు ఆగస్టు చివరి వారంలోపు పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నామని.. సెప్టెంబర్ 15 వ తేదీ నాటికి అడ్మిషన్స్ పూర్తి చేసేందుకు అనుగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని యోచిస్తున్నామని ఆయన తెలిపారు. సెట్స్ తో పాటుపాటు డిగ్రీ, పీజీ పరీక్షల  నిర్వహణ తేదీలు కూడా మార్పు ఉంటుందని, డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణకు కామన్ పాలసీని అమల్లోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ విద్యవిధానంలోనే తరగతుల నిర్వహణ కొనసాగుతుందని, పరిస్థితులు కుదుటపడ్డాక ప్రత్యక్ష తరగతులపై ఆలోచిస్తామన్నారు.