న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా 2030 నాటికి 2.5 కోట్లకు పైగా ఉద్యోగాలు వస్తాయని ఒక రిపోర్ట్ తెలిపింది. సీఐఈఎల్ హెచ్ఆర్ స్టడీ ప్రకారం, 2020 నుంచి ఈ రంగంలో నియామకాల డిమాండ్ 51 శాతం పెరిగింది.
ఈపీసీ రంగంలో ప్రస్తుతం 8.5 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రాజెక్టులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరిగినా ఉద్యోగాలకు ముప్పు లేదని, ఇది వృద్ధిని మరింత పెంచుతుందని రిపోర్ట్ వెల్లడించింది. మొత్తం నియామకాలలో 80 శాతం డిమాండ్ ముంబై, ఢిల్లీ వంటి టైర్1 నగరాల నుంచి వస్తోంది. రోడ్లు హైవేలు (26 శాతం), పవర్ ట్రాన్స్మిషన్ (15 శాతం) రంగాలలో అధిక డిమాండ్ ఉంది.
