EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఆటో సెటిల్మెంట్ లిమిట్ రూ.5లక్షలకు పెంపు

EPFO News: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఆటో సెటిల్మెంట్ లిమిట్ రూ.5లక్షలకు పెంపు

EPFO Auto Settlement: దేశంలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పీఎఫ్ సౌకర్యాన్ని పొందుతుంటారు. ఈ క్రమంలో భవిష్యనిధి సంస్థ అత్యవసర అవసరాల కోసం డబ్బును విత్ డ్రా చేసుకునే అనుమతిని ఆటోమేట్ చేస్తున్నట్లు కొన్ని నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సౌకర్యం లిమిట్ భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. 

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అడ్వాన్స్ క్లెయిమ్స్ కోసం ఆటో సెటిల్మెంట్ లిమిట్ గతంలో ఉన్న రూ.లక్షను ప్రస్తుతం రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది అత్యవసర నిధులు అవసరమైన సమయంలో వేగంగా, ఎక్కువ మెుత్తాన్ని చేతికి పొందేందుకు వెసులుబాటు కల్పిస్తుందని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. పైగా ఈ క్లెయిమ్స్ కేవలం 3 రోజుల్లోనే ఆటోమెటిక్ విధానంలో సెటిల్ చెయబడతాయని లేబర్ మంత్రి మన్సుక్ మాండవియ వెల్లడించారు. 

 

చెల్లింపులను ఆటోమేట్ చేయటం ద్వారా ఆలస్యాలను తగ్గించటం, ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను తొలగించటం లక్ష్యంగా తీసుకురాబడింది. అడ్వాన్స్డ్ క్లెయిమ్ విత్ డ్రా విధానాన్ని తొలిసారిగా ఈపీఎఫ్ఓ కరోనా మహమ్మారి సమయంలో తీసుకురాబడింది. అయితే ప్రస్తుతం ఈ సౌకర్యం కింద పరిమితిని పెంచటం హర్షనీయంగా చాలా మంది చెబుతున్నారు. 

దీనికి ముందు మే 2024 వరకు విత్ డ్రా పరిమితి రూ.50వేలుగా ఉండగా.. ఆటోమెటిక్ సెటిల్మెంట్ కింద విత్ డ్రా పరిమితిని ఈపీఎఫ్ఓ రూ.లక్షకు పెంచింది. పీఎఫ్ సభ్యులకు వేగవంతమైన సేవలను అందించే లక్ష్యంగా ఈ అడుగులు వేస్తు్న్నట్లు కేంద్రం చెబుతోంది.