
ముంబై: ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ శనివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో లాభపడ్డాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ శనివారం ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్లలో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను నిర్వహించి ప్రాథమిక సైట్లో పెద్ద అంతరాయం లేదా వైఫల్యాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధతను తనిఖీ చేశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 61 పాయింట్లు పెరిగి ఆల్టైమ్ క్లోజింగ్ హై 73,806.15కి చేరుకుంది. నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి కొత్త ముగింపు గరిష్ట స్థాయి 22,378.40 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ -లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.394.06 లక్షల కోట్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుందని ట్రేడర్లు చెప్పారు.