సౌత్ కొరియాలోని డేగులో జరుగుతున్న ఏషియన్ షూటింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో సిల్వర్, గోల్డ్ పతకాలు భారత్ ను వరించాయి. ఈషా సింగ్ తన ఆట తీరుతో దూసుకెళ్తోంది. సింగిల్ లో నిన్న సిల్వర్ సాధించిన ఇషా సింగ్.. టీం షూట్లో ఇవాళ గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుంది.
టీం షూట్ విభాగంలో భారత్ తరపున మనుభాకర్, ఈషా సింగ్, శిఖా నర్వాల్ ఆడారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల జూనియర్ టీం ఈవెంట్ లో దక్షిణ కొరియా జట్టును వీరు ఓడించారు. 16 – 12 పాయింట్ల తేడాతో దక్షిణ కొరియా టీమ్ (యాంగ్ జియిన్, కిమ్ మిన్ సియో, కిమ్ జుహీ)ను భారత్ ఓడించింది.
అంతకుముందు బుధవారం రోజున జూనియర్ విమెన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ ఈవెంట్లో మను భాకర్ 17– 15 పాయింట్ల తేడాతో ఇషాను ఓడించి గోల్డ్ నెగ్గింది. దీంతో ఈషా సింగ్ కు సింగిల్స్ విభాగంలో సిల్వర్ దక్కింది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో శివ నర్వాల్ గెలుపొందగా, జూనియర్ పురుషుల విభాగంలో సాగర్ డాంగీ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో అనుభవజ్ఞుడైన కొరియన్ పార్క్ డేహున్పై శివ మెరుగ్గా నిలిచి.. గట్టి పోటీలో అతన్ని 17-13తో ఓడించాడు. దీంతో ఇప్పటివరకు భారత్కు మొత్తం 4 పతకాలు వచ్చాయి.