సింగరేణికి తీరనున్న ఎక్స్​ప్లోజివ్స్​ తక్లీఫ్

సింగరేణికి తీరనున్న ఎక్స్​ప్లోజివ్స్​ తక్లీఫ్
  • కొత్త ప్లాంట్​ఏర్పాటుకు  సింగరేణి బోర్డు ఒకే

మందమర్రి, వెలుగు: సింగరేణిలో పేలుడు పదార్థాల కొరత త్వరలో తీరనుంది. ఇప్పటికే రెండుచోట్ల సొంతంగా ఎక్స్​ప్లోజివ్స్​ తయారు చేస్తుండగా మరో ప్లాంట్​ఏర్పాటుకు సింగరేణి బోర్డు శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ఏటా 50 వేల టన్నుల కెపాసిటీ గల ప్లాంట్​ను మందమర్రి ఏరియాలో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ప్లాంట్​ అందుబాటులోకి వస్తే బెల్లంపల్లి రీజియన్​పరిధిలోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లోని బొగ్గు గనులకు సకాలంలో పేలుడు పదార్థాలు  ​​ అందనున్నాయి.  

గనుల్లో ఎక్స్​ప్లోజివ్స్​వినియోగం ఇలా..

సింగరేణి సంస్థ అండర్​గ్రౌండ్​మైన్స్​లో బొగ్గు వెలికితీసేందుకు, ఓసీపీల్లో మట్టి(ఓవర్​బర్డెన్​), బొగ్గును వెలికితీసేందుకు ఎక్స్​ప్లోజివ్స్​పై ఆధారపడుతోంది.  సింగరేణి వ్యాప్తంగా 23 అండర్​గ్రౌండ్ మైన్స్, 19 ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఇందుకు ఏటా సుమారు 3 లక్షల టన్నుల పేలుడు పదార్థాలు  అవసరమవుతాయి. ఓసీపీల్లో ఎస్ఎంఈ(సైట్​ మిక్స్​డ్​ ఎమల్షన్), లార్జ్​క్యాట్రిడ్జ్​ ఎక్స్​ప్లోజివ్స్, అండర్ ​గ్రౌండ్​ మైన్స్​లో పర్మిటెడ్​ఎక్స్​ప్లోజివ్స్(పీ5) వినియోగిస్తున్నారు. 3 లక్షల టన్నుల్లో 2.50 లక్షల టన్నుల ఎస్ఎంఈ మహారాష్ట్రలోని రాజురాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 8  ప్రైవేటు కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఎక్స్‌‌‌‌ప్లోజివ్స్‌‌‌‌ తయారీకి అవసరమైన ముడిసరుకును రాష్ట్రీయ కెమికల్స్‌‌‌‌అండ్‌‌‌‌ ఫర్టిలైజర్స్‌‌‌‌(ఆర్‌‌‌‌సీఎఫ్‌‌‌‌), దీపక్‌‌‌‌ ఫర్టిలైజర్స్‌‌‌‌ నుంచి కొనుగోలు చేస్తోంది. సొంతగా సింగరేణి సంస్థ రామగుండం-3, మణుగూరు ఏరియాల్లో నడుపుతున్న ప్లాంట్ల నుంచి ఏటా 50 వేల టన్నుల ఎస్ఎంఈ ఉత్పత్తి జరుగుతోంది. సింగరేణి వ్యాప్తంగా రోజుకు సగటున 500 టన్నుల ఎక్స్​ప్లోజివ్స్​ తో 15 నుంచి 18 లక్షల క్యూబిక్​ మీటర్ల ఓవర్​బర్డెన్​ వెలికితీస్తున్నారు. ప్రతి గనికి రోజూ 30 నుంచి 40 టన్నుల పేలుడు పదార్థాలు అవసరం.  

రెండు సొంత ప్లాంట్లు..

సింగరేణి గతంలో మహారాష్ట్రలోని నాసిక్​ నుంచి పేలుడు పదార్థాలను దిగుమతి చేసుకునేది. అక్కడి కేంద్రంలో భారీ ప్రమాదం జరిగి 23 మంది మృతిచెందారు. దీంతో కొద్ది రోజులవరకు రవాణా నిలిచిపోయింది. 2018 నుంచి సొంతంగా రామగుండం 3, మణుగూరులో 50 వేల టన్నుల కెపాసిటీ గల సైట్​​ మిక్సింగ్​ఎమల్సన్​ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంది. ఆర్జీ 3 ప్లాంట్​నుంచి రామగుండం, బెల్లంపల్లి రీజియన్ల గనులు, మణుగురు ప్లాంట్​నుంచి కొత్తగూడెం రీజియన్ ​మైన్స్​కు పేలుడు పదార్థాల సప్లయ్​జరుగుతోంది. సమ్మర్​లో  ఇతర ప్రాంతాల నుంచి ఎక్స్​ప్లోజివ్స్​ సప్లయ్​లో కొరత ఉంటోంది. కరోనా టైమ్​లో సప్లయ్ ​పూర్తిగా నిలిచింది. మరోవైపు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్​లో అమ్మోనియం నైట్రేట్‌‌‌‌ ధర పెరగడం, రష్యా, ఉక్రెయిన్​ యుద్ధం వల్ల దిగుమతికి విఘాతం వంటి కారణాలు ఎక్స్‌‌‌‌ప్లోజివ్స్‌‌‌‌ తయారీపై ఎఫెక్ట్​ చూపడంతో గత ఏడాది బొగ్గు టార్గెట్​ చేరుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కొత్త ప్లాంట్​ఏర్పాటుకు  సింగరేణి నిర్ణయం తీసుకుంది.     

బెల్లంపల్లి రీజియన్​ గనులకు అనుకూలం

మందమర్రి ఏరియాలో కొత్తగా 50 వేల టన్నుల కెపాసిటీ ఎస్ఎంఈ ప్లాంట్లును ఇండియన్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌తో కలిసి సింగరేణి ఏర్పాటు చేయనుంది. ప్లాంటు అందుబాటులోకి వస్తే ​ బెల్లంపల్లి రీజియన్​లోని  మందమర్రిలో 2,  శ్రీరాంపూర్​లో 2, బెల్లంపల్లి ఏరియాలో ఒక ఓసీపీతో పాటు భవిష్యత్తులో వచ్చే మరో రెండు ఓసీపీలకు ఎక్స్​ప్లోజివ్స్​సకాలంలో అందుతాయి. ప్రస్తుతం రామగుండం 3 ప్లాంట్​తో పాటు మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్లాంట్​ను రామకృష్ణాపూర్​సింగరేణి రెస్క్యూ స్టేషన్,​ మూసివేసిన కోల్​వాసరీ మధ్య, కాళీనగర్​(పాకిస్తాన్​క్యాంప్​) ఎదుట గల స్థలాల్లో ఒకచోట ఏర్పాటు చేయనున్నారు.  ఏడాదిలోపు నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు.