మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన కాన్వాయ్ ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల తన బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు కాన్వాయ్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఎమ్మెల్యేగా ఇచ్చే గన్మెన్లను మినహా మిగతా సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపేశారు. మెదక్ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలను తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు.