
హైదరాబాద్: దేశానికి తెలంగాణ దిక్సూచి అన్నారు హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్. బుధవారం ఆయన ఓ నేషనల్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అంతర్జాతీయ విమానాలు క్యాన్సిల్ చేయాలని మొదట కోరింది.. ముందుగా లాక్ డౌన్ ప్రకటించింది కూడా తెలంగాణ రాష్ట్రమేనని చెప్పారు. మర్కజ్ గురించి కూడా కేంద్రానికి సమాచారం అందించింది కూడా తెలంగాణనే అన్న ఈటల.. దేశానికే తెలంగాణ దిక్షూచి అన్నారు.
వెయ్యికిపైగా మంది మర్కజ్ కి వెళ్లినట్లు తెలిసిందని.. 160 మందిని తప్ప అందరినీ గుర్తించామన్నారు. రెండు రోజుల్లోనే ఇంత మందిని గుర్తించి, పరీక్షలు చేయిస్తున్నాము అంటే తెలంగాణ ప్రభుత్వం సత్తా, చిత్తశుద్ది అర్దం చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరగలేదన్నారు.
గాంధీ హాస్పిటల్ లో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి నెగెటివ్ వచ్చిందని.. మరో సారి పరీక్ష చేసి డిశ్చార్జ్ చేస్తామన్న మంత్రి.. బుధవారం మరో ఇద్దరు గాంధీ నుండి డిశ్చార్జ్ అవుతున్నారని తెలిపారు. డిశ్చార్జ్ అయిన వారందరూ మరో 14 రోజులు హోమ్ క్వారంటిన్ లో ఉండాలని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్.