నీటితో కూడా వాహనాలు నడుస్తాయట

నీటితో కూడా వాహనాలు నడుస్తాయట

రోజు రోజుకీ పెరుగుతున్న పెట్రోల్,డీజిల్ రేట్లతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో కల్తీ పెట్రోల్ తో మరింత పరేషాన్ అవుతున్నారు. అయితే ఇకపై పెట్రోల్ నీళ్లు కలిపితే బాధ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 80 శాతం నీరు… 20 శాతం ఇంధనంతో నడిచే కారును రూపొందించారు ఓ తెలుగు సైంటిస్ట్ .పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా…. నీటితో నడిచే వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే పూర్తిగా నీటితో ప్రయాణించే వాహనాన్ని తయారు చేస్తానంటున్నారు శాస్త్రవేత్త సుందరరామయ్య.

గుంటూరుకు చెందిన పర్యావరణ శాస్త్రవేత సుందరరామయ్య. తనకు వచ్చిన ఆలోచనను 16 ఏళ్ల పాటు కష్ట పడి నిజం చేశారు. సాధారణ అవసరాలకు వాడే నీటితోనే నడిచే వాహనాన్ని తయారు చేశారు. వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ ద్వారా 20 శాతం ఇంధనం. 80 శాతం నీరుతో వాహనాలను నడపవచ్చని తెలిపారు.

నీరు అంటే ఆక్సిజన్, హెడ్రోజన్ మిశ్రమం. నీటి నుంచి హెడ్రోజన్ ను వేరు చేసి ఎందుకు ఇంధనంగా ఉపయోగించకూడదు అన్న ఆలోచనలో ప్రయోగాలు మొదలు పెట్టారు సుందర రామయ్య. వాటర్ హెడ్రోలసిస్  థెరఫీ ద్వారా హెడ్రోజన్ తయారవుతుంది. అలా తయారు అయిన హెడ్రోజ్.. ఇంజన్ లోకి వెళ్లీ కంప్రెస్ అవుతుంది. ఇంజన్ నడవడానికి ఈ హెడ్రోజన్ ఉపయోగపడుతుంది. వాటర్ ఫ్యూయల్ తో  వాహనాల మైలీజీ కూడా పెరుగుతుందంటున్నారు సుందర్. ఒక లీటర్ వాటర్ ని తీసుకొని అది కొన్ని వందల లీటర్ల హైడ్రోజన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ డైరెక్టుగా కంబషన్ చాంబర్ లోకి వెళ్లి.. ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఒక లీటర్ వాటర్ ఫ్యూయల్.. 30 లీటర్ల ఫ్యూయల్ కు సమానమంటున్నారు సుందర్.

హైడ్రోజన్ ఫ్యూయల్ పర్యావరణహితం అంటున్నారు సుందర్. ప్రస్తుత వాహనాల ద్వారా పర్యావరణానికి కీడు చేసే కార్బన్ డైక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అవుతోంది. వాటర్ తో నడిచే వాహనాల ద్వారా కేవలం ఆక్సిజన్ మాత్రమే విడుదల అవుతుంది. మరో ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో నీటితో నడిచే కారును  రూపొందించబోతున్నామన్నారు సుందర్. నీటి నుంచి హెడ్రోజన్ వేరు చేయడం చాలా ప్రమాదకరమైన ప్రక్రియ అయినప్పటికి చాలా రిస్క్ తో కూడిన ప్రయోగం చేస్తున్నామని చెప్పారు.

మరోవైపు వాటర్ ఫ్యూయల్ పరికరం ఖరీదు చాలా ఎక్కువ. ఈ పరికరాన్ని వాహనంలో అమర్చాలంటే  దాదాపు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇది సామాన్యుడికి చాలా భారం. అందుకే ఈ ప్రొడెక్ట్ ను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సుందర రామయ్య.