చెన్నై: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ -2021 రానే వస్తోంది. గురువారం ఐపీఎల్ -2021కి వేలం వేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో ఈ వేలం ప్రారంభమవుతుంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 164 మంది ఇండియన్ ప్లేయర్లు కాగా.. 125 మంది విదేశీ ప్లేయర్లు ఉండగా… మరో ముగ్గురు అసోసియేట్ దేశాల ప్లేయర్లు ఉన్నారు. అయితే వీళ్ల నుంచి 61 మంది ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి. ఈ క్రమంలో ఏ టీమ్ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఏ టీమ్కు ఎంత మంది ప్లేయర్స్ తీసుకునే అవకాశం ఉందో ఒకసారి పరిశీలిద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 6
డబ్బు : రూ.19.9 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 8
డబ్బు: రూ.13.04 కోట్లు
పంజాబ్ కింగ్స్
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 9
డబ్బు: రూ.53.2 కోట్లు
కోల్కతా నైట్రైడర్స్
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 8
డబ్బు: రూ.10.75 కోట్లు
ముంబై ఇండియన్స్
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 7
డబ్బు: రూ.15.35 కోట్లు
రాజస్థాన్ రాయల్స్
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 9
డబ్బు : రూ.15.35 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 14
డబ్బు: రూ.35.4 కోట్లు
సన్రైజర్స్ హైదరాబాద్
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 3
డబ్బు: రూ.10.75 కోట్లు