
- ఎంసీఐ రూల్స్ ప్రకారం అమలుచేస్తామని హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ప్రస్తుత ఎన్ఎంసీ) రూల్స్ ప్రకారం మెడికల్ ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన తరగతుల)లకు రిజర్వేషన్లు కల్పిఈఈఈస్తామంటూ హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. 2024–25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ఆగస్టు 28న ఇచ్చిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు బెంచ్ఇటీవల విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆగస్టు 28న తాను వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. అయితే రాష్ట్రంలో ఆ ప్రస్తావనే లేకుండా అడ్మిషన్లు కొనసాగుతున్నాయన్నారు. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు.
అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ 2024–25 విద్యాసంవత్సరానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏజీ ఇచ్చిన ఈ హామీని ధర్మాసనం నమోదు చేస్తూ పిటిషన్పై విచారణ ముగించింది.