సింగరేణి మైనింగ్ లీజు భూమికి..ఎక్స్గ్రేషియా చెల్లింపు

సింగరేణి మైనింగ్ లీజు భూమికి..ఎక్స్గ్రేషియా చెల్లింపు

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 1 ఏరియాలో జీడీకే 5 ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్ట్​ కోసం సుందిళ్ల గ్రామంలోని రైతుల వద్ద మైనింగ్​ కోసం తీసుకున్న లీజు భూమికి రూ.1.04 కోట్ల ఎక్స్​గ్రేషియా చెక్కులను మేనేజ్‌‌మెంట్‌‌ అందజేసింది. గురువారం ఏరియా జీఎం ఆఫీస్‌‌లో జరిగిన కార్యక్రమంలో జీఎం డి.లలిత్​ కుమార్​ 16.04 ఎకరాల భూమికి (ఎకరానికి రూ.6.50 లక్షల చొప్పున) సంబంధించి ఏడుగురు రైతులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఎక్స్​గ్రేషియా చెల్లింపు ఆపలేదని, కంపెనీకి అందిన అప్లికేషన్లను పరిశీలించి అర్హులకు ఎక్స్​గ్రేషియా చెల్లించనున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని సుందిళ్ల గ్రామస్తులు గమనించాలని కోరారు. కార్యక్రమంలో ఆఫీసర్లు ఆంజనేయ ప్రసాద్​, డి.రమేశ్‌‌, జీఎల్​ రాజు, ధనలక్ష్మిబాయి, సాంబశివరావు, ఆఫ్రిన్​ సుల్తానా పాల్గొన్నారు.