స్నేహితుడి భార్యకు ట్రాప్

స్నేహితుడి భార్యకు ట్రాప్

స్నేహితుడు కదా అని ఇంటికి రానిస్తే.. సంసారంలో చిచ్చు పెట్టాడు. స్నేహితుడి భార్యపై కన్నేసి ఆమెను నెమ్మదిగా ముగ్గులోకి దింపాడు. ప్రేమ వ్యవహారం నడిపాడు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదింరపులకు దిగి శారీరకంగా కూడా వాడుకున్నాడు. సినిమా ఫీల్డ్‌లో పరిచయాలు ఉన్నాయంటూ ఆమెను నమ్మించాడు. సినిమాల్లో అవకాశలు ఇప్పిస్తానంటూ ఆమె వద్ద భారీగా డబ్బులు కూడా తీసుకున్నాడు. దీంతో డబ్బులు తిరిగి అడిగితే చంపుతామని బెదిరింపులకు దిగాడు. చివరకు బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 


మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రశాంత్ అనే వ్యక్తి కుత్బుల్లాపూర్ కు చెందిన తన స్నేహితుడి భార్యను రెండేళ్ల క్రితం పరిచయం చేసుకున్నాడు. భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లిన ప్రశాంత్ ఆమెపై ప్రేమ పెంచుకున్నాడు. తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ పలుమార్లు హెచ్చరించి ఆమెను శారీరకంగా వాడుకున్నాడు ప్రశాంత్. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించాడు నిందితుడు. 

అంతటితో ఆగకుండా  సినీఫీల్డ్ లో తనకు పరిచస్తులు ఉన్నారని ఆమెను నమ్మించాడు. ప్రశాంత్‌ను గుడ్డిగా నమ్మిన మహిళ తనకున్న ఓ ప్లాటును రూ. 16లక్షలకు విక్రయించి ఆ నగదును ప్రశాంత్ కు అప్పగించింది.  దాంతో ఇచ్చిన నగదుని ఇవ్వమని బాధితురాలు అడగగా ఆమెను భయబ్రాంతులకు గురిచేసాడు. అతడి వేధింపులు భరించలేక చివరకు ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది.  రెండేళ్లుగా తనను శారీరకంగా ఉపయోగించుకుని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించడంతో పాటు తీసుకున్న నగదును ఇవ్వడం లేదని బాధితురాలు పెట్ బషీరాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.