
- ఎంతో మంది తీస్మార్ ఖాన్లను మాయం చేసినం
- కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలట..!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్అన్నారు. సెక్రటేరియట్లో కంప్యూటర్లు, పేపర్లు ఉంటాయని..లంకెబిందెలు ఉండవని ఎద్దేవా చేశారు. ఘట్కేసర్లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ‘కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నరు.
అయితే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. కృష్ణా, గోదావరి జీవ నదులు. కృష్ణా నదిలో మన వాటాను కేంద్రం ఇంకా తేల్చలేదు. మన వాటా చెప్పకుండానే ఆ బోర్డుకు మన కృష్ణా జలాలను తాకట్టు పెట్టారు. రేవంత్ లాంటి వాళ్లను చాలా మందిని చూసాం. ఎంతో మంది తీస్మార్ ఖాన్లను మాయం చేసి తెలంగాణ తెచ్చారు కేసీఆర్. ఎవరికి అన్యాయం జరిగిన అందరం బస్ వేసుకొని వస్తం.
న బాస్లు ఢిల్లీ, గుజరాత్లలో లేరు. తెలంగాణ మాట ఢిల్లీలో వినబడాలి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలి’ అని మాజీ మంత్రి కోరారు.