గుండె పోటుతో మాజీ మంత్రి కన్నుమూత

గుండె పోటుతో మాజీ మంత్రి కన్నుమూత

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పసుపులేటి బ్రహ్మయ్య  కన్నుమూశారు. గుండెపోటు రావడంతో  కడప నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా దారి మద్యలో ఖాజీపేట వద్ద మృతి చెందారు. మృతదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు బందువులు. గత ఎన్నికల్లో రాజంపేట టీడీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన బ్రహ్మయ్య మనస్థాపానికి గురై గుండె పోటుతో విజయవాడ ఆస్పత్రిలో చికిత్సతీసుకున్నారు. అప్పటి నుంచి శ్వాసకోశ వ్యాదితో బాధపడుతున్నారు. 1994,1999 రాజంపేట నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.మంత్రిగా పనిచేశారు.