చంద్రబాబు గుట్టు ఐటీ బయటపెట్టింది..: మాజీ మంత్రి పేర్నినాని

చంద్రబాబు గుట్టు ఐటీ బయటపెట్టింది..: మాజీ మంత్రి పేర్నినాని

ఐటీ నోటీసులు వ్యవహారం లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. .   ప్రతి ఏటా చంద్రబాబు తన ఆస్తుల చిట్టాని ప్రకటించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు , అందులో తన ఆస్తుల వివరాలను ఎందుకు చెప్పలేదని పేర్ని నాని ప్రశ్నించారు.  

చంద్రబాబు అవినీతి భాగోతం పై ఆంగ్ల పత్రిక లో వార్త ప్రచురణ చేశారని పేర్ని నాని పేపర్ కటింగ్ చూపించారు.   అమరావతి రాజధాని బయోస్కోప్ కధలు ఒకొక్కటి బయటకు వస్తున్నాయన్నారు.  చంద్రబాబు భాగోతం 2016 నుండి 2019 వరకూ  బయటకు రావాల్సి ఉందన్నారు. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజి సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చినందుకు  రూ. 118 కోట్ల లంచం డబ్బులు వసూలు చేశారని ఐటీ అధికారులు గుర్తించారని పేర్ని నాని ఆరోపించారు.  ఈ డబ్బు అంతా ఒక వ్యక్తి నుండి వచ్చిన లంచం డబ్బు మాత్రమేనని ..  ఆస్తుల ప్రకటన లో చంద్రబాబు ఈ నిధులను ఎందుకు ప్రకటించలేదని పేర్ని నాని ప్రశ్నించారు.

చంద్రబాబు ... మోడీ,అమిత్ షా, భారతి , విజయమ్మ తో జగన్ ఏమి మాట్లాడినా కనిపెట్టే మీడియా సంస్థలు ఈ నోటీసుల గురించి ఎందుకు పట్టించుకోలేదని పేర్ని నాని ప్రశ్నించారు.  చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇచ్చారా ఇవ్వలేదా..నిజమా కాదా.. నోరు తెరవాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా కాదా..అని చంద్రబాబు ని ప్రశ్నించారు. 

జనం సొమ్మును తండ్రీ కొడుకులు తిన్నారు : పేర్ని నాని 

జనం సొమ్మును హల్వా తిన్నట్లు తండ్రీకొడుకులు తిన్నారని, లోకేష్ పాదయాత్ర ఆపి తన తండ్రి అవినీతి పై మాట్లాడాలన్నారు.  అమరావతి పేరుతో ప్రతీది లంచం  తీసుకున్నారని.. పోగేసుకోని తిన్నారని ఫైర్ అయ్యారు. కేవలం అమరావతి రాజధాని లొనే ఇంత అవినీతి ఉంటే మిగిలిన పనుల్లో ఎంత ఎంత తిన్నారో, అని అనుమానం వ్యక్తం చేశారు.

షర్మిల సోనియా గాంధీ ని కలవటం పై కూడా పేర్ని నాని స్పందించారు.  షర్మిల ఒక పార్టీ నాయకురాలని, ఆమెది ఒక స్వతంత్ర రాజకీయ పార్టీ ఆమె నిర్ణయాలు ఆమె ఇష్టం..అని పేర్కొన్నారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లోకి వస్తారనే ప్రచారం పై ... జగన్ జనం గుండెల్లో ఉన్నారు.. ఎవరు వచ్చిన ఏమి ఉంటుందని అన్నారు. రాజకీయ పార్టీలు వస్తుంటాయి.. విలీనం అవుతాయని అన్నారు