కేజీబీవీ పోస్టుల భర్తీకి పరీక్ష తేదీలు ఖరారు

కేజీబీవీ పోస్టుల భర్తీకి పరీక్ష తేదీలు ఖరారు

హైదరాబాద్, వెలుగు : కస్తూర్బా బాలికల విద్యాలయాలు(కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్ఎస్)లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను జులై 24, 25, 26 తేదీల్లో నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్​ శ్రీ దేవసేన వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేజీబీవీ, యూఆర్ఎస్​లో ఉన్న1,241 పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నారు. 854 పీజీ సీఆర్టీ, 273 సీఆర్టీ, 77 పీఈటీ, 12 ఎస్​వోపోస్టులు భర్తీ చేస్తారు. రాత పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. జులై 5 వరకు ఆన్​లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.