కోస్గి వెలుగు : నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కమిషనర్ నాగరాజు అధ్యక్షతన పశువుల సంత, తైబజార్ నిర్వహణకు బహిరంగ వేలం నిర్వహించారు. పశువుల సంత నిర్వహణ హక్కులను మాటికోటి వెంకటయ్య రూ. 85.10 లక్షలకు దక్కించుకోగా, తైబజార్ నిర్వహణ హక్కులను బసవపురం రవికుమార్ గౌడ్ రూ. 34.13లక్షలకు దక్కించుకున్నారు.
