
సికింద్రాబాద్, వెలుగు : తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సికింద్రాబాద్పరేడ్ గ్రౌండ్ ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బుధవారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. వేడుకలకు రాష్ట్ర నలుమూలాల నుంచి ప్రజలు రానున్నారని చెప్పారు. ట్రాఫిక్అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్టేజ్ఏర్పాటు, విద్యుత్, బారికేడ్లు, మంచి నీరు, ఎల్ఈడీ స్క్రీన్లు, మైక్ సిస్టమ్ తదితర సదుపాయాలను పరిశీలించారు. వారితో కాంగ్రెస్ నాయకులు రోహిన్రెడ్డి, మోతె శోభన్రెడ్డి ఉన్నారు.