పాలమూరుపై పగ..కాళేశ్వరంపై కక్ష.. పాలమూరు జిల్లాను ఎండబెట్టిందే కాంగ్రెస్: కేటీఆర్

పాలమూరుపై పగ..కాళేశ్వరంపై కక్ష.. పాలమూరు జిల్లాను ఎండబెట్టిందే కాంగ్రెస్: కేటీఆర్
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులు మేమే చేశాం.. 
  • మిగిలిన 10% పనులైనా రేవంత్ సర్కార్ చేయట్లేదు  
  • రెండేండ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదు
  • పాలమూరు జిల్లాకు కాంగ్రెస్సే విలన్ అని ఫైర్

నాగర్‌‌‌‌కర్నూల్, వెలుగు: పాలమూరు జిల్లాను ఎండబెట్టిందే కాంగ్రెస్ అని బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ ​కేటీఆర్ ​మండిపడ్డారు. ‘‘పాలమూరుపై సీఎం రేవంత్​రెడ్డి పగబట్టిండు.. కాళేశ్వరంపై కక్షగట్టిండు. మా హయాంలోనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90% పూర్తి చేశాం. కానీ మిగిలిన 10% పనులను చేయకుండా.. ఆ ప్రాజెక్టును పూర్తిగా పండబెట్టి.. రైతులను ఎండగొట్టిండు’’ అని ఫైర్ అయ్యారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్​ప్రభుత్వం రెండేండ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను ఆదివారం నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేటీఆర్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పాలమూరు జిల్లాకు సాగు నీళ్లు ఇచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్​ రూ.35 వేల కోట్లతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​ మొదలుపెట్టారు. రూ.28 వేల కోట్లతో 90 శాతం పనులు పూర్తి చేశారు. 70 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్లు కట్టారు. పంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 145 మెగావాట్ల బాహుబలి మోటార్లు పెట్టారు. మధ్యలో కొన్ని కాల్వల పని మాత్రమే మిగిలింది. కానీ ఆ పనులు కూడా చేయకుండా సీఎం రేవంత్ పాలమూరును ఎండబెట్టారు” అని ఫైర్ అయ్యారు.

మళ్లీ మనదే అధికారం.. 
నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం​లేకపోవడం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ అన్నారు. ‘‘బీఆర్ఎస్​ మద్దతుతో గెలిచిన సర్పంచులొస్తే క్యాంప్ ఆఫీస్ గేట్​దగ్గరి నుంచే గెంటేస్తామని కాంగ్రెస్​ఎమ్మెల్యేలు వాగుతున్నారు. సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అధికారాన్ని ఎవరూ గుంజుకోకుండా రాజ్యాంగమే రక్షణగా ఉంటుంది. బీఆర్ఎస్​నాయకులు పట్టించుకోకపోయినా క్యాడర్​గట్టిగా నిలబడడం వల్లనే పంచాయతీల్లో సత్తా చాటాం. రానున్న పరిషత్, మున్సిపల్​ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పోరాడాలి” అని ధీమా వ్యక్తం చేశారు. 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పేరొస్తదనే పనులు చేస్తలేరు.. 
పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌‌‌‌కు పేరొస్తదనే, సీఎం రేవంత్ ఆ పనులు చేయట్లేదని కేటీఆర్ ఆరోపించారు. ‘‘పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌‌‌‌కు పేరొస్తదని, తన పాత బాస్‌‌కు కోపమొస్తదని రేవంత్​కు  భయం. తెలంగాణను 1956లో ఏపీలో విలీనం చేసిన కాంగ్రెస్.. ఇక్కడి రైతుల నోట్లో శాశ్వతంగా మట్టికొట్టింది. అప్పటి నుంచే పాలమూరు వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్మల జిల్లాగా మారింది. పాలమూరు జిల్లాకు కాంగ్రెస్​ పార్టీనే విలన్” అని మండిపడ్డారు.