
రెండేళ్ల పిల్లాడి నుంచి 90 ఏళ్ల ముసలి వాళ్ల వరకు స్మార్ట్ ఫోన్ లేనిదే సెకన్ గడవని పరిస్థితి. పిల్లాడు అన్నం తినడం లేదంటే ఫోన్లలో గేమ్స్ పెట్టి ఇచ్చి గోరు ముద్దలు తినిపిస్తారు. అది ఇప్పుడు బాగానే తరువాత వారి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ఊహించారా.. కొంతమంది ఈ విషయం తెలిసినా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక యువత విషయానికొస్తే తెల్లార్లు ఛాటింగ్ చేస్తూ కాలం గడుపుతుంటారు. ఇదీ మరీ ప్రమాదానికి దారితీస్తుంది.
తలనొప్పి సమస్య.. కంటిచూపు మందగింపు
గంటల తరబడి మొబైల్లో ఛాటింగ్ చేయడం వల్ల తలనొప్పి సమస్య ఏర్పడి , కంటిచూపు మందగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యువతలో ఈ జబ్బు వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా మొబైల్, ల్యాప్టాప్లో ఎక్కువ సేపు పనిచేసే వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అర్థరాత్రి వరకు మొబైల్ చూడటమే ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది.
ఆరోగ్యానికి హాని..
ఈ రోజుల్లో యువత అర్థరాత్రి వరకు మొబైల్ను చూస్తారు. దీంతో అర్థరాత్రి వరకు మెలకువగా ఉండడం, నిత్యం మొబైల్ చూడటం వల్ల కళ్లు బలహీనమవుతున్నాయి. రాత్రి ఆలస్యంగా మేల్కొనడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. రాత్రిపూట చీకట్లో మొబైల్ వాడకం మరిన్ని సమస్యలను సృష్టిస్తోంది. ఎక్కువ సేపు మొబైల్, ల్యాప్టాప్లో పనిచేసే వారికి దగ్గర వస్తువులు సరిగా కనిపించవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి ఈ సమస్య వస్తే దానికి పరిష్కారం ఉండదు. ముఖ్యంగా 40 ఏళ్లలోపు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లలు, పెద్దల్లో సగం మందికి తలనొప్పి( మైగ్రేన్) సమస్య తెరపైకి వస్తోంది.
మొబైల్ ఎక్కువుగా వాడితే...
మారుతున్న జీవనశైలి దీనికి కారణం. కంప్యూటర్, టీవీ, మొబైల్ ఎక్కువగా వినియోగించడం వల్ల మైగ్రేన్ సమస్యగా మారుతోంది. అర్థరాత్రి వరకు మొబైల్, కంప్యూటర్ పై పనిచేయడం, తగినంత నిద్ర లేకపోవడం, బయటి ఆహారం తినడం, పని ఒత్తిడి వంటివి మైగ్రేన్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.
మైగ్రేన్ సమస్య ఉందా...
మైగ్రేన్ నివారించడానికి, పొగాకు, ఆల్కహాల్ మొదలైనవాటిని మానుకోండి. ఎండలో తక్కువగా వెళ్లండి. తగినంత సమయం నిద్రపోండి. మైగ్రేన్ సమస్యపై మరింత ఇబ్బంది కలిగించే విషయాన్ని నివారించండి. దీనితో పాటు, ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి వైద్యుడిని సంప్రదించండి. నిత్యం యోగా చేయడం, వ్యాయామం చేయడం, బీపీని అదుపులో ఉంచుకోవడం, షుగర్ని చెక్ చేసుకోవడం వంటివి చేయాలి.
నివారణకు చిట్కాలు
ఇక మైగ్రేన్ నొప్పి నివారణ కోసం ముఖ్యంగా యోగా చేయడం చాలా ఉపయోగపడుతుంది. అలాగే వాకింగ్ చేయడం ద్వారా మైగ్రేన్ నొప్పి నుంచి బయటపడే అవకాశం ఉంది. శరీరం బ్యాలెన్స్ కోల్పోవడం వంటి జబ్బులకు ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం ద్వారా మైగ్రేన్ నుంచి బయటపడవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించడం ద్వారా కూడా మైగ్రేన్ నొప్పి నుంచి బయటపడే వెళ్ళింది. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూడటం తగ్గిస్తే మంచిది. లేకపోతే ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే అవుతుంది.