నిజామాబాద్ జిల్లాలో లంచం కోసం బెదిరింపు..సీపీకి ఎక్సైజ్ సీఐ ఫిర్యాదు

నిజామాబాద్ జిల్లాలో  లంచం కోసం బెదిరింపు..సీపీకి ఎక్సైజ్ సీఐ ఫిర్యాదు

నిజామాబాద్​, వెలుగు : ప్రతినెలా తనకు లంచం ఇవ్వాలని, లేకుంటే జాబ్​ పోగొడతానని బెదిరిస్తున్న వ్యక్తిపై నగర ఎక్సైజ్​ సీఐ స్వప్న శుక్రవారం సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంకు చెందిన దానయ్యగౌడ్ తెలంగాణ కల్లుగీత వృత్తి సంఘానికి ప్రెసిడెంట్​ను అంటూ కొంత కాలంగా రంగారెడ్డి, మెదక్​, హైదరాబాద్​, సిద్దిపేట జిల్లాల్లోని ఎక్సైజ్ ఆఫీసర్లను ముడుపులు ఇవ్వాలని బెదిరించేవాడు. లేకుంటే వారిపై ఉన్నతాధికారులకు ఇష్టమొచ్చినట్లు ఫిర్యాదులు ఇచ్చేవాడు. 

ఈ రకంగా నగర ఎక్సైజ్​ సీఐ స్వప్నకు పలుమార్లు ఫోన్​ చేసి మామూళ్లు ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. స్వప్నపై ఏసీబీకి ఫిర్యాదు చేశానంటూ బోగస్​ పేపర్స్​ను​ ఆమె వాట్సాప్​కు పంపాడు. లంచం ఇవ్వకుంటే ఉద్యోగం ఊడగొట్టిస్తానంటూ వేధించాడు. దీంతో సీఐ స్వప్న సీపీ సాయిచైతన్యను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.  స్పందించిన సీపీ నాలుగో టౌన్​లో కేసు నమోదు చేయించి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.