
- రేపు 104 గ్రామాలకు ఆబ్కారీ ఆఫీసర్ల టీం
- నార్కొటిక్ డీఎస్పీ సోమనాథం
నిజామాబాద్, వెలుగు : కల్తీ కల్లు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని నార్కొటిక్ రీజనల్ డీఎస్పీ సోమనాథం సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఆబ్కారీ ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. కల్తీ కల్లుకు దూరంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఉమ్మడి జిల్లాలో కల్లు కల్తీకి ప్రమాదకరమైన డ్రగ్స్ వాడడం వల్ల కొందరు బానిసలుగా మారుతున్నారన్నారు.
ఈ నెల7న ప్రతి మండలంలోని నాలుగు గ్రామాలు కలిపి జిల్లావ్యాప్తంగా 104 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్టూడెంట్స్, యూత్ ర్యాలీ, వీడియోల ప్రదర్శన, వాల్పోస్టర్లు అంటించాలన్నారు. డాక్టర్, ఎస్సై, పంచాయతీ సెక్రటరీ, పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయ సంఘాలను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. కల్తీ కల్లు, డ్రగ్స్ విక్రయిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం ఇవ్వాలన్నారు. అంతకు ముందు కల్తీ కల్లుకు వ్యతిరేకంగా గ్రామాల్లో అంటించే పోస్టర్లను కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుతో కలిసి
ఆవిష్కరించారు.