న్యూఢిల్లీ: ఇప్పటి వరకు 25 లక్షల వెహికల్స్ను ఎగుమతి చేశామని మారుతి సుజుకీ బుధవారం ప్రకటించింది. తన 25 లక్షవ బండిగా సుజుకీ బాలెనోని గుజరాత్లోని ముంద్రా పోర్ట్ నుంచి లాటిన్ అమెరికాకు ఎగుమతి చేశామని వెల్లడించింది. ఎగుమతుల్లో 25 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకోవడం ఇండియా మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీకి నిదర్శనమని కంపెనీ ఎండీ హిసషి టకెయుచి అన్నారు. ప్రభుత్వం తెచ్చిన మేకిన్ ఇండియా ఇనీషియేటివ్కు సపోర్ట్గా ఉన్నామని పేర్కొన్నారు. మారుతి సుజుకీ మొదటిసారిగా 1986– 87 లో ఎగుమతులు స్టార్ట్ చేసింది. మొదటి కన్సైన్మెంట్ కింద 500 కార్లను హంగేరికి ఎక్స్పోర్ట్ చేసింది. ప్రస్తుతం మారుతి సుజుకీ సుమారు 100 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తోంది. ‘కంపెనీ ఎక్స్పోర్ట్స్ 1986–87 ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మా వెహికల్స్ను కస్టమర్లు ఆదరిస్తున్నారు. హై క్వాలిటీ, సూపీరియర్ టెక్నాలజీ, రిలయబిలిటీ, పెర్ఫార్మెన్స్, అఫోర్డబిలిటీ వంటి కారణాలతో గ్లోబల్ కస్టమర్లకు చేరువయ్యాం’ అని టకెయుచి పేర్కొన్నారు. ఇండియా నుంచి ప్యాసెంజర్ వెహికల్స్ ఎగుమతి చేస్తున్న కంపెనీల్లో నెంబర్ వన్ పొజిషన్లో మారుతి సుజుకీ ఉందని అన్నారు. నెక్సా రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మే ప్రీమియం కార్లు ఈ ఏడాది టాటా మోటార్స్, హ్యూండయ్ సేల్స్ కంటే ఎక్కువగా ఉంటాయని మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. కాగా, కంపెనీ 2015 లో తమ నెక్సా రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. బాలెనో, ఇగ్నీస్, సియాజ్, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా వంటి కార్లను ఈ స్టోర్లలో అమ్ముతున్నారు.
25 లక్షల వెహికల్స్ ఎగుమతి..మారుతి సుజుకీ
- బిజినెస్
- March 30, 2023
లేటెస్ట్
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ క్యాబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!