ఎఫ్ 3 విజయం పట్ల చాలా గర్వంగా వుంది

ఎఫ్ 3 విజయం పట్ల చాలా గర్వంగా వుంది

 విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఎఫ్3 మూవీ అంతటా అశేష అభిమానాన్ని చూరగొంటుంది. ఈ నేపథ్యంలో  నిర్వహించిన ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ కు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ మూడో వారం కూడా ఇంకా థియేటర్ లో ఆడుతూ రెవెన్యూ రాబట్టడమే ఎఫ్ 3 విజయానికి నిదర్శనమని దిల్ రాజు చెప్పుకొచ్చారు. 

ఘనత వారికే దక్కుతుంది

ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చిన ఈ చిత్రంపై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ప్రశంసలు గుప్పించారు. దిల్  రాజు, శిరీష్ లు కథలు ఎంపిక చేయడంలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని తెలిపారు. కొత్త దర్శకుల ను ప్రోత్సహించి ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ఘనత వారికే దక్కుతుందన్న ఆయన.. దిల్ రాజు ద్వారా పరిచయమైన దర్శకులు ఈ రోజు సూపర్ సక్సెస్ లో వున్నారని గుర్తు చేశారు.
 
ఎఫ్ 3విడుదలైనప్పటి నుండి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ., తెలుగు రాష్ట్రాలు, ఓవర్సిస్ లో అద్భుతమైన విజయం సాధించిందని నిర్మాత దిల్ రాజు అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడితో ఐదు విజయవంతమైన సినిమాలు పూర్తయ్యాయన్న ఆయన.. డబుల్ హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నామని తెలిపారు. వెంకటేష్ తో మూడు విజయాలు, వరుణ్ తేజ్ తో మూడు విజయాలు అందుకున్నామని దిల్ రాజు చెప్పారు.

షీల్డ్ ఇవ్వడం నాకు చాలా ఇష్టం

సినిమా విడుదలై 17రోజులు పూర్తయినా  ఇంకా షేర్ రూపంలో డబ్బు ఇస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అని దిల్ రాజు చెప్పారు. ఒక సినిమా విజయం సాధిస్తే షీల్డ్ ఇవ్వడం నాకు చాలా ఇష్టం. అది చాలా గొప్ప జ్ఞాపకం. ఎఫ్ 3 యూనిట్ కు గొప్ప జ్ఞాపకంగా వుండాలని అందరికీ షీల్డ్స్ ఇచ్చాం. ఇది మాకు చాలా ఆనందంగా వుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ గారికి కృతజ్ఞతలు. అనిల్ రావిపూడితో సెకండ్ హ్యాట్రిక్ పూర్తి చేస్తాం అని దిల్ రాజు గర్వంగా చెప్పారు.

సినిమా విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ రావడం, నిర్మాతలకు డబ్బులు రావడం ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి. డిస్ట్రిబ్యూటర్లు అందరూ హ్యాపీగా వున్నారనే ఆలోచన ప్రతి నటుడికీ ఆనందాన్ని ఇస్తుంది. ఎఫ్ 3లో భాగమైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' అని హీరో వరుణ్ తేజ్ తెలిపారు.  

ఇది నిజమైన విజయం

తానెప్పుడూ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండే కథని రాస్తుంటాని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. "నాకు గొప్ప పేరు వస్తుందా రాదా అని అలోచించను. డబ్బులు పెట్టి సినిమా చూస్తున్న ప్రేక్షకులని ఎలా ఎంటర్ టైన్ చేయాలనే ఆలోచనతోనే కథలు రాస్తుంటానని చెప్పారు. సినిమా సినిమాకి ఎంతో కొంత నేర్చుకుంటున్నాను. జోనర్స్ మారుస్తున్నాను.  మీ అందరి ఆశీస్సులతో ఇంత దూరం వచ్చాను. మున్ముందు కూడా మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను. పాండమిక్ తర్వాత సినిమా చూసే విధానం మారింది. ఓటీటీ ఓ సమాంతర వేదిక అయ్యింది. సినిమా థియేటర్ కి వస్తే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు , విజువల్ వండర్స్ ని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా వీకెండ్ అయిపోతుంది. వారం గడిస్తే సినిమా ఉంటుందా అనే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఎఫ్ 3 థర్డ్ వీకెండ్ లో కూడా షేర్ రాబడుతూ, కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ అవుతూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే .. ఇది నిజమైన విజయం. ఎఫ్ 3విజయం పట్ల చాలా గర్వంగా వుంది. పాండమిక్ తర్వాత ప్రేక్షకులంతా వంద కోట్లకి పైగా గ్రాస్ ఇచ్చారంటే ఇది మామూలు విషయం కాదు. ఇంత గొప్ప విజయం ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు" అని అనిల్ తెలిపారు.

ఈ సినిమాలో వెంకటేష్ గారు ఇరగదీశారన్న ఆయన.. వరుణ్ నత్తి వచ్చిన ప్రతిసారి ఎంజాయ్ చేశానన్నారు. నమ్మిన సినిమాని బలంగా తీశావ్ అని మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. బాలకృష్ణ గారు ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ గా షో చూసి అభినందించారని.. ఆయనకి నా స్పెషల్ థాంక్స్ ని తెలియజేశారు అనిల్ రావిపూడి. 'F2' ఫ్రాంచైజీతో మళ్ళీ వస్తామన్న ఆయన... ఫన్ అండ్ ఫస్ట్రేషన్ తో మిమ్మల్ని మళ్ళీ అలరిస్తామని... ఆరు నెలల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ 'ఎన్ బీకే 108'తో మళ్ళీ కలుద్దాం '' అని అనిల్ రావిపూడి ముగించారు.