కాషాయ గూటికి ప్రియాంక మౌర్య ?

కాషాయ గూటికి ప్రియాంక మౌర్య ?

అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ప్రియాంక మౌర్య త్వరలో కమలం గూటికి  చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. 10 లక్షల మంది సోషల్ మీడియా ఫాలోవర్స్  ఉన్న తన పేరు ప్రఖ్యాతులను కాంగ్రెస్ నేతలు ప్రచారానికి ఉపయోగించుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్లు కేటాయించే సమయంలో మాత్రం తనను పక్కను పెట్టి మరొకరికి సీటు ఇచ్చి  తీవ్ర అన్యాయం చేశారని చెప్పారు. పార్టీని నమ్ముకున్న తనను కుట్రతో మోసం చేశారని మండిపడ్డారు. ప్రియాంక గాంధీ కార్యదర్శి సందీప్ సింగ్ కు లంచం ఇవ్వలేకపోవడంతో టికెట్ ఇవ్వలేదని ప్రియాంక మౌర్య ఆరోపించారు.  


మరిన్ని వార్తల కోసం

జైలులో ఫోన్ మింగేసిన ఖైదీ

మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కు కరోనా