టీటీడీలో సరికొత్త టెక్నాలజీ

టీటీడీలో సరికొత్త టెక్నాలజీ

తిరుమలలో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. మార్చి 1వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా నివారించడానికి, గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగిస్తారు.