రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ పై ఉత్కంఠ వీడింది. ఆర్సీబీ కొత్త కెప్టెన్ డుప్లెసిస్ అంటూ ఆర్సీబీ తన ట్విట్టర్లో వెల్లడించింది. బెంగళూరు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న సంగతి తెలసిందే. గత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు డుప్లెసిస్. అయితే ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో డుప్లెసిస్ ను రూ. 7 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఆర్సీబీ. 2020 ఫిబ్రవరిలో డుప్లెసిస్ సౌతాఫ్రికా అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పటి వరకు 100 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన డుప్లెసిస్ 2935 పరుగులు చేశాడు. డుప్లెసిస్ ను కెప్టెన్ గా ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నాడు కోహ్లీ. అతని సారథ్యంలో ఆడటానికి ఎదురు చూస్తున్నానని.. సెల్పీ వీడియో రిలీజ్ చేశాడు కోహ్లీ. మార్చి 26 నుంచి ఐపీఎల్ స్టార్ట్ కానుంది.
The Leader of the Pride is here!
— Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2022
Captain of RCB, @faf1307! ?#PlayBold #RCBCaptain #RCBUnbox #ForOur12thMan #UnboxTheBold pic.twitter.com/UfmrHBrZcb
“Happy to pass on the baton to Faf! Excited to partner with him and play under him” - A message from @imVkohli for our new captain @faf1307. ?#PlayBold #RCBUnbox #UnboxTheBold #ForOur12thMan #IPL2022 pic.twitter.com/lHMClDAZox
— Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2022