ఆల్ఫా హోటల్‌లో బాంబు ఉందంటూ ఫేక్‌ కాల్‌

ఆల్ఫా హోటల్‌లో బాంబు ఉందంటూ ఫేక్‌ కాల్‌

సికింద్రాబాద్​, వెలుగు : సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్‌లో బాంబు పెట్టారంటూ ఫేక్​ కాల్​ చేసిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.  ఖమ్మంకు చెందిన గౌస్​పాషా (39) ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చి జగద్గిరిగుట్టలో  నివాసముంటున్నాడు. కూకట్‌పల్లిలోని  ఓ హోటల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 27న పోలీసులకు ఫోన్ చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ ఎదురుగా ఉన్న ఆల్ఫా హోటల్‌లో బాంబు పెట్టారని  చెప్పాడు. 

పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కాల్ చేసిన వ్యక్తికి ఫోన్ చేయగా..​ స్విచాఫ్​ అని వచ్చింది.  వెంటనే ఆల్ఫా హోటల్‌ నుంచి జనాన్ని బయటకు పంపించి హోటల్​ అంతా తనిఖీ చేశారు.  చివరకు బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్​కాల్​ చేసిన వ్యక్తి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన పోలీసులు 100కు డయల్ చేసిన సమయంలో  కాల్​ ఖమ్మం నుంచి వచ్చినట్లు గుర్తించారు.  ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఖమ్మం వెళ్లి గౌస్​పాషాను అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్ కు తరలించారు.