
దాదాపు వెయ్యి మంది బాధితులు
హైదరాబాద్ : ‘‘తక్కువ ధరకే ఫ్లాట్ ఇప్పిస్తాం. మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువ వడ్డీ చెల్లి స్తాం’’ అంటూ ఓ సంస్థ రూ.300 కోట్లు కొల్లగొట్టిం ది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. మాదాపూర్ కి చెందిన రఘు, విజయవాడకి చెందిన నివాస్బాబు మాదాపూర్ లో స్వదాద్రి కంపెనీ ఓపెన్ చేశారు. తక్కువ రేటుకే ప్లాట్లు, ఫ్లాట్లుఇప్పి స్తామంటూ పలువురి దగ్గర రూ.10లక్షల నుంచి రూ.40లక్షల దాకా వసూలుచేశారు. డబ్బు చెల్లించాక రెస్పాం డ్ అవడం లేదు. ఆఫీస్కు వెళ్తే మూసి ఉంటోంది. మరోవైపు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ అనేక మంది నుంచి లక్షల రూపాయలు తీసుకున్నారు. మూడు, నాలుగు నెలలు వడ్డీ చెల్లించి, ఆ తర్వాత తిప్పించుకుని తిరుగుతున్నారు. ఇలా 4 రోజుల నుంచి మాదాపూర్ పీఎస్కు వందల్లో కంప్లయింట్లు వచ్చాయి. రఘును పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బాధితుల్లో ప్రభుత్వాధి కారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువమంది సాఫ్ట్వేర్, ప్రైవేట్ ఉద్యో గులు ఉన్నారు. దాదాపు వెయ్యి మంది ఇన్వెస్ట్ చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసును సీఐడీకి అప్పగించనున్నట్లు తెలిసింది.