ఎంత పెద్ద ప్లాన్ : జిరాక్స్ షాప్​లో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్​

ఎంత పెద్ద ప్లాన్ : జిరాక్స్ షాప్​లో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్​
  • కర్నాటక నుంచి హైదరాబాద్​ కు తరలిస్తుండగా  అరెస్ట్  
  • 18 లక్షల ఫేక్ కరెన్సీ స్వాధీనం 

శంషాబాద్, వెలుగు: ఫేక్ కరెన్సీ ముద్రించి రాష్ట్రానికి తీసుకువస్తున్న అంతర్రాష్ట ముఠాలోని  ఓ సభ్యుడిని శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నాటకలోని కొప్పల్ తాలూకా హోసా లింగాపురం గ్రామానికి చెందిన కొరచ మురుగేశ్​(25) అక్కడ జిరాక్స్ షాప్ నిర్వహిస్తున్నాడు. తన అన్న రవిచంద్ర, అన్న కొడుకు యోగేశ్​ కలిసి జిరాక్స్ సెంటర్ లో రూ. 500 కరెన్సీ ఫేక్ నోట్లు జిరాక్స్ తీశారు. 

అనంతరం ఆ నోట్లను మురుగేశ్​ బైక్​పై శంషాబాద్ కు తీసుకొస్తున్నాడు. మంగళవారం శంషాబాద్ రూరల్ సబ్ ఇన్ స్పెక్టర్ భాస్కరరావు ఆధ్వర్యంలో తొండుపల్లి వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో చెక్​ చేయగా సుమారు రూ. 18 లక్షల విలువైన నకిలీ కరెన్సీ దొరికింది.  పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.  రవిచంద్ర, యోగేశ్​ కోసం గాలిస్తున్నామని తెలిపారు.