ఫేక్కస్టమర్ కేర్కు ఫోన్..రూ.1.40 లక్షలు మాయం

ఫేక్కస్టమర్ కేర్కు ఫోన్..రూ.1.40 లక్షలు మాయం

బషీర్​బాగ్, వెలుగు: బ్లింక్ ఇట్ కస్టమర్ కేర్ కు ఫోన్​ చేయబోయి ఓ వ్యక్తి స్కామర్ల ఉచ్చులో పడ్డాడు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన 64 ఏళ్ల వృద్ధుడు ఆన్​లైన్ లో బ్లింక్ ఇట్ యాప్ ద్వారా సరుకులను ఆర్డర్ చేశాడు. 

ఆర్డర్ అందుకున్న తరువాత ఒక వస్తువు మిస్సింగ్ ఉండటంతో.. గూగుల్ లో బ్లింక్ ఇట్ కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేశాడు. అందులో స్కామర్స్ పెట్టిన నంబర్​కు పొరపాటున ఫోన్​ చేశాడు. స్కామర్లు నిజమైన కస్టమర్ కేర్ ప్రతినిధులుగా నటించి బాధితుడి ఫోన్​పే, ఇతర వివరాలు తీసుకున్నారు. 

కాసేపటి తరువాత అతని అకౌంట్ నుంచి రూ.1,40,024 డెబిట్ అయ్యాయి.