- ఎనిమిది మంది అరెస్ట్
భద్రాచలం, వెలుగు : అమాయక ఆదివాసీలను లక్ష్యంగా చేసుకుని నకిలీ నోట్ల చెలామణి చేస్తున్న ముఠాను చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మహిళతో పాటు బాలుడు, మరో ఎనిమిది మంది ఉన్నారు. మంగళవారం భద్రాచలం ఏఎస్పీ రోహిత్రాజు వివరాలు వెల్లడించారు. చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన చిరిగిడి నరేశ్, కలివేరు గ్రామానికి చెందిన బోస్ ప్రేమ్కుమార్, చర్లకు చెందిన సయ్యద్ఇక్బాల్, కొత్తపల్లి గ్రామానికి చెందిన గుమ్మల సర్వేశ్వరరావు, మరో బాలుడితో పాటు ఆంధ్రాలోని గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన సబ్బటి జయలక్ష్మి, తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన మల్లెల వినోద్కుమార్, పెద్ద రావూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి జీవరత్నం దొంగనోట్లను ముద్రించి ఈ ప్రాంతంలో చెలామణి చేస్తున్నారు. చత్తీస్గఢ్ సరిహద్దు నుంచి కూలీ పని చేయడానికి వచ్చేవారికి, వారపు సంతలకు వచ్చే ఆదివాసీలకు ఈ నకిలీ కరెన్సీ నోట్లను అంటగట్టేవారు. నిందితుల నుంచి రూ.500 నోట్లు 551, రూ.2000 నోట్లు 90, రూ.200 నోట్లు 300, సీపీయూ, మానిటర్ , కీబోర్డు , ఐరన్బాక్స్, ఆకుపచ్చని సన్నటి కవర్లాంటి దారం, పెన్సిల్ చెక్కడానికి ఉపయోగించే చాక్లు 10, కారును స్వాధీనం చేసుకున్నారు. రూ.5.15 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
