డీసీపీ శిల్పవల్లికి సైబర్ వల..స్పీడ్ గా వెళ్లడంతో ఛలానా పడిందంటూ మెసేజ్

డీసీపీ శిల్పవల్లికి  సైబర్  వల..స్పీడ్ గా వెళ్లడంతో ఛలానా పడిందంటూ మెసేజ్
  • మూడు రోజుల్లో రెండు లింకులు
  • ‘సంచార్​సాథి’కి ఫిర్యాదు

హైదరాబాద్​ సిటీ, వెలుగు:  ‘స్పీడ్ కెమెరా మీ వాహనం వేగంగా వెళ్తున్నట్లు గుర్తించింది. ఈ లింక్​క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి’ అంటూ ఖైరతాబాద్​జోన్​డీసీపీ శిల్పవల్లికి సైబర్​ నేరగాళ్లు ఓ మెసేజ్​పంపి డబ్బులు కొల్లగొట్టాలని ప్లాన్​వేశారు. వారి పన్నాగాన్ని గుర్తించిన ఐపీఎస్ శిల్పవల్లి జనాలకు అవగాహన కల్పించడం కోసం ఆ మెసేజ్​లను స్క్రీన్​షాట్​తీసి ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

‘2026 జనవరి 10న మీ వాహనం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు రికార్డయ్యింది. లింకు క్లిక్​చేసి పూర్తి వివరాలు చూడండి. జాగ్రత్తగా వాహనం నడపండి..ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటూ నాకు 96782.... అనే నెంబర్ నుంచి మూడు రోజుల్లో రెండు మెసేజెస్​వచ్చాయి. వాటిని నేను క్లిక్ చేయలేదు’ అని ఆమె రాశారు. 

దీనిపై ఆమె సంచార్ సాథీ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేశారు. ప్రజలు కూడా తనకు వచ్చినట్టే అనుమానాస్పద మెసేజ్ లు వస్తే.. లింక్ క్లిక్ చేయకుండా  https://www.sancharsaathi.gov.in/ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.