ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్ ప్రమాదం.. స్తంభించిన రైళ్ల రాకపోకలు

ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్ ప్రమాదం.. స్తంభించిన రైళ్ల రాకపోకలు

హౌరా – సికింద్రాబాద్​ ఫలక్ నుమా ఎక్స్​ప్రెస్​రైలులో షార్ట్​సర్క్యూట్​తో మంటలు చెలరేగిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు కాలి బూడిదయ్యాయి. పక్క బోగీలకు మంటలు వ్యాపిస్తుండటంతో అధికారులు ట్రైన్​ లింక్​ తొలగించారు. ప్రయాణికులు అప్రమత్తం అయి చైన్​ లాగడంతో పెను ప్రమాదం  తప్పింది. 

ALSO READ :Falaknuma express: అంతా క్షణాల్లోనే.. పొగలు రావటం.. చెయిన్ లాగటం.. దూకేయటం..

ట్రాక్ పై రైలు నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడవవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని సమయాల్లో మార్పులపై స్థానిక రైల్వే అధికారులకు సంప్రదించాలని సూచిస్తున్నారు.