మెగాస్టార్ మరో రీమేక్.. ఆ మూవీ వద్దే వద్దంటున్న ఫ్యాన్స్

మెగాస్టార్ మరో రీమేక్.. ఆ మూవీ వద్దే వద్దంటున్న ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ కి రెడీ అవుతున్నాడట. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ దయచేసి ఆ సినిమా రీమేక్ వద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫాన్స్ అంతలా వద్దు అని రిక్వెస్ట్ చేస్తున్న సినిమా మరేదో కాదు.. మలయాళంలో సూపర్ హిట్ ఐన "బ్రో డాడీ" మూవీ. మలయాళ సూపర్ స్టార్స్ మోహన్ లాల్, పృధ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు. అంత పెద్ద స్టార్స్ చేసిన సినిమాని ఫ్యాన్స్ ఎందుకు వద్దంటున్నారు అనేది తెలియాలంటే. ముందు ఆ సినిమా కథ ఏంటో తెలియాలి.

ఈ కథ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రి కొడుకులు. పృథ్వీరాజ్ తన స్నేహితురాలు కళ్యాణితో సహజీవనం చేస్తూ ఉంటాడు. ఇక పృథ్వీరాజ్ భార్య, తల్లి ఒకేసారి ప్రెగ్నెంట్ అవుతారు. అలా ఒకేసారి ఒకరికి బ్రో, ఇంకొకరికి డాడీ అవుతాడు పృథ్వీరాజ్ . లేట్ వయస్సులో తన తల్లి ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది..? తండ్రీకొడుకులు కలిసి ఈ విషయాన్ని ఎలా సరిదిద్దారు అనేది మిగిలిన కథ. ఈ కథ వినడానికే అదోలా ఉంది. అలాంటిది ఈ సినిమాలో చిరు యాక్ట్ చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా. అందుకే ఈ సినిమా రీమేక్ ని చేయొద్దని మెగాస్టార్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి.. ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు ఈ రీమేక్ నిండి చిరు తప్పుకుంటాడా లేదా అనేది చూడాలి మరి.

ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన భోళా శంకర్ మూవీ షూటింగ్లో ఫుల్ బిజీ గా ఉనాడు. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ వేదాలం కి రీమేక్ గా రానున్న ఈ మూవీని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న  ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.