రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత ఒక స్పెషల్ గుర్రానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దగ్గరుండి వీడ్కోలు చెప్పారు. తన సేవల నుంచి ఆ గుర్రం ఇవాళే రిటైర్ అయింది. ఆ గుర్రం ప్రత్యేక ఏంటా అనుకుంటున్నారా? రాష్ట్రపతి బాడీగార్డ్ కమాండెంట్లో ఉండే గుర్రం అది. దాని పేరు విరాట్. రాష్ట్రపతి బాడీగార్డ్ కమాండెంట్ కల్నల్ అనూప్ తివారీ ఈ గుర్రాన్ని వాడుతున్నారు. గడిచిన 13 సంవత్సరాలుగా రిపబ్లిక్ డే పరేడ్లో ఇలా పాల్గొంటూ వస్తున్నారు.
ఈ గుర్రం ప్రత్యేక దేనికీ లేదు
రాష్ట్రపతి బాడీ గార్డ్స్ కమాండెంట్ గుర్రాల్లో దేనికీ కూడా ‘విరాట్’కు ఉన్న ప్రత్యేకత లేదు. ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ అవార్డును పొందిన గుర్రం ఇది. ఈ ఏడాది జనవరి 15న జరిగిన ఆర్మీ డే కార్యక్రమంలో ఈ అవార్డును విరాట్కు బహూకరించారు. ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ అవార్డును అందుకున్న తొలి గుర్రం ఇదే కావడం విశేషం. విశిష్ఠమైన సేవలు అందించి, ప్రత్యేక సామర్థ్యాల కలిగిన గుర్రాలకు మాత్రమే ఈ అవార్డును ఇస్తారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన గుర్రం కాబట్టే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ వంటి వారు దానికి దగ్గరుండి వీడ్కోలు చెప్పారు.