స్టార్టర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్.. మెదక్ జిల్లాలో రైతు మృతి

స్టార్టర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్.. మెదక్ జిల్లాలో రైతు మృతి

మెదక్ ​టౌన్, వెలుగు: విద్యుత్ షాక్​తో యువ రైతు చనిపోయిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ లింగం, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్​ మండలం గుట్టకిందిపల్లికి చెందిన అత్రెబోయిన చంద్రం(31) శుక్రవారం  పొలంలో కరెంట్ స్టార్టర్​వద్ద మరమ్మతులు చేసేందుకు వెళ్లాడు. విద్యుత్ సరఫరా అయ్యే ట్రాన్స్​ఫార్మర్​జంపర్​కొట్టేందుకు వెళ్లగా విద్యుత్ షాక్​కొట్టి స్పాట్ లో చనిపోయాడు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.