ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ నుంచి పోటీ చేయబోతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ తప్పనిసరిగా గెలవాలని భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ తికాయత్ అన్నారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని..అయితే చట్ట సభలో తగినంత ప్రతిపక్ష బలం ఉండాలని అనుకుంటున్నామన్నారు. యూపీ అసెంబ్లీలో కూడా బలమైన ప్రతిపక్షం కావాలనే ఉద్దేశంతోనే యోగి గెలుపును కోరుకుంటున్నామన్నారు రాకేశ్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన..మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం యోగి ఆదిత్యనాథ్ గెలవాలనే అనుకుంటున్నామని.. మన రాష్ట్రానికి చాలా బలమైన ప్రతిపక్షం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం సమాజ్వాదీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తికాయత్ ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు ఏ పార్టీకి తాము మద్దతు ఇవ్వబోమని తెలిపారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిన సుదీర్ఘ రైతుల నిరవధిక ఆందోళనలో తికాయత్ ప్రముఖంగా వ్యహరించారు. అంతే కాకుండా చట్టాలను వెనక్కి తీసుకోకపోతే బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తామని హెచ్చరించారు. అయితే చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు నవంబర్లో ప్రధాని మోడీ ప్రకటించారు. అయినప్పటికీ ఎంఎస్పీపై చట్టబద్ధత సహా మరిన్ని రైతుల డిమాండ్లు మిగిలే ఉన్నాయని తెలిపారు తికాయత్.
మరిన్ని వార్తల కోసం...